‘యువశక్తి ‘ పేరుతో జనసేన భారీ సభ
- January 02, 2023
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించగా..ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు జనవరి 12 న శ్రీకాకుళం జిల్లాలో ‘యువశక్తి ‘ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో.. రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోందని పవన్ అన్నారు.
యువతీయువకులు అందరూ ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. యువత తమ ఆలోచనల గురించి.. వారి కష్టాల గురించి.. వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుందని పవన్ వివరించారు. మన యువత.. మన భవిత.. అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
జనవరి 12న ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని.. యువతకు భరోసా ఇవ్వడానికే యువశక్తి సభ నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. యువశక్తికి సంబంధించి జనసేన ఓ వీడియోను విడుదల చేసింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







