వైష్ణవ్ పంజా కొత్త సినిమా.! ఇది చాలా స్పెషల్ గురూ.!
- January 03, 2023
పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్యాండమిక్ టైమ్లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో బాక్సాఫీస్కి కాసుల పంట పండించాడు పంజా వైష్ణవ్ తేజ్.
తొలి సినిమా ఆ స్థాయిలో సూపర్ హిట్ అవ్వడంతో, తదుపరి సినిమా కోసం పెద్దగా అంచనాల్లేని కాన్సెప్ట్ ఛూజ్ చేసుకుని ఫర్వాలేదనిపించాడు. అదే ‘కొండ పొలం’.
ముచ్చటగా మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ అంటూ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చాడు. ధియేటర్లలో ఈ సినిమా ఆడకపోయినా, ఓటీటీ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. వైష్ణవ్లో చాలా విషయముందని ప్రూవ్ చేసింది.
ఇక ఇప్పుడు నాలుగో సినిమా కోసం కొత్త డైరెక్టర్ని ఎంగేజ్ చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సారి యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. సైలెంట్గా షూటింగ్ కానిచ్చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడం సినిమాకీ, వైష్ణవ్కీ కూడా కలిసొచ్చే అంశమే.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది







