వైష్ణవ్ పంజా కొత్త సినిమా.! ఇది చాలా స్పెషల్ గురూ.!
- January 03, 2023
పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్యాండమిక్ టైమ్లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో బాక్సాఫీస్కి కాసుల పంట పండించాడు పంజా వైష్ణవ్ తేజ్.
తొలి సినిమా ఆ స్థాయిలో సూపర్ హిట్ అవ్వడంతో, తదుపరి సినిమా కోసం పెద్దగా అంచనాల్లేని కాన్సెప్ట్ ఛూజ్ చేసుకుని ఫర్వాలేదనిపించాడు. అదే ‘కొండ పొలం’.
ముచ్చటగా మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ అంటూ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చాడు. ధియేటర్లలో ఈ సినిమా ఆడకపోయినా, ఓటీటీ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. వైష్ణవ్లో చాలా విషయముందని ప్రూవ్ చేసింది.
ఇక ఇప్పుడు నాలుగో సినిమా కోసం కొత్త డైరెక్టర్ని ఎంగేజ్ చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సారి యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. సైలెంట్గా షూటింగ్ కానిచ్చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడం సినిమాకీ, వైష్ణవ్కీ కూడా కలిసొచ్చే అంశమే.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









