రష్మికా.! ఇదో కొత్త పబ్లిసిటీనా.!
- January 04, 2023రష్మిక ఏం చేసినా తప్పయిపోతోంది ఈ మధ్య. మొన్న ‘కాంతార’ సినిమా ఇంకా చూడలేదన్నందుకు ఓ గొడవ. నిన్న విజయ్ దేవరకొండతో న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దొరికిపోయిందంటూ ఇంకో గొడవ.. అంతకు ముందు బోలెడన్ని కాంట్రవర్సీలు.
ఇలా రష్మిక మండన్నాని సోషల్ తెరపై నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా ఆటాడేసుకుంటున్నారు. ఆ ఆటకు చెక్ పెట్టాలనుకుందేమో రష్మిక తాజాగా మరో పోస్ట్ పెట్టింది.
ఈ సారి మరో స్టార్ హీరోయిన్ సమంతను తన పబ్లిసిటీకి వాడేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా అనారోగ్యంతో బాధపడుతున్న సమంతను తాను అమ్మలా చూసుకుంటానని పోస్ట్ పెట్టింది రష్మిక.
సమంత అంటే తనకెంతో ఇష్టమనీ, తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని రష్మిక చెప్పింది. సమంత చాలా స్ర్టాంగ్ లేడీ అని, ఆమె ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తుంటా.. అని రష్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరోవైపు సమంత అనారోగ్యాన్ని రష్మిక ఇలా వాడేసుకుంటోందన్న మాట.! అని రష్మిక హ్యాటర్స్ అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









