‘వీరయ్య’ వెర్సస్ ‘వీర సింహం’: మనోభావాల ‘మైత్రి’ చెడిపోకుండా.!
- January 04, 2023
ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోరుకు దిగుతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో దిగడం కొత్తేమీ కాకపోయినా, ఈ సారి రేస్ మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది.
రెండు సినిమాలూ ఖచ్చితంగా హిట్ అవ్వాలి. బాక్సాఫీస్ కళకళలాడాలి. ఎందుకంటే, సినిమాకి గడ్డు కాలం నడుస్తున్న రోజులివి. సినీ ఇండస్ర్టీ ఆ గడ్డు సమస్య నుంచి కోలుకోవాలంటే, ఇలాంటి రెండు పెద్ద సినిమాలూ.. ఇవే కాదు, సంక్రాంతికి రాబోతున్న ఎన్ని సినిమాలైతే అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి.
మంచి వసూళ్లు రాబట్టాలి. ఇక, ‘వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల విషయానికి వస్తే, ఈ రెండు సినిమాల నిర్మాతలూ, హీరోయిన్, ఇతర టెక్నీషియన్లూ చాలా వరకూ కలిసి పని చేశారు.
అందుకే ఎవరి మనోభావాలూ దెబ్బ తినకుండా రెండు సినిమాలనూ ఈక్వెల్గా ప్రమోట్ చేస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ రెండు సినిమాల్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ప్రమోషన్ల విషయంలో ఎలాంటి పక్షపాతం వహించకుండా స్నేహపూర్వకంగా మెలగుతున్నారు. పక్కా ప్లానింగ్తో ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అత్యంత కీలకంగా మారాయి. ఈ నెల 6 వ తేదీన జరగబోయే ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒంగోలు వేదిక కానుంది. ‘వాల్తేర్ వీరయ్య’ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఇంతవరకూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఈ ‘మైత్రి’ రిలీజ్ వరకూ కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









