సౌదీలో 3 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలు పట్టివేత
- January 05, 2023
రియాద్: సౌదీ అరేబియాలో 3 మిలియన్లకు పైగా యాంఫెటమైన్ మాత్రలను రాజ్యంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారని డ్రగ్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. మాదక ద్రవ్యాల నిరోధక అధికార ప్రతినిధి మేజర్ మొహమ్మద్ అల్-నుజైదీ మాట్లాడుతూ.. యువత భద్రతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ప్రమోషన్ నెట్వర్క్ల సెక్యూరిటీ ఫాలో-అప్ సమయంలో" అధికారులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. 3,049,451 యాంఫెటమైన్ మాత్రలను ట్రక్కు కంపార్ట్మెంట్లలో దాచిపెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో ఈ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. రాజధాని రియాద్, తూర్పు ప్రావిన్స్లో ముగ్గురు సౌదీ పౌరులను అరెస్టు చేసినట్లు అల్-నుజైదీ చెప్పారు. వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు అల్-నుజైదీ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







