స్పీకర్ అహ్మద్ తో సమావేశమైన భారత రాయబారి పీయూష్
- January 06, 2023
మనామా: కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లంతో బహ్రెయిన్ రాజ్యంలో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అహ్మద్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు, అన్ని స్థాయిలలో శాశ్వత వృద్ధిని ప్రశంసించారు. ఆసియా ఖండం అభివృద్ధిలో భారతదేశం పోషించిన కీలక పాత్రను కొనియాడారు. భారతదేశం-గల్ఫ్ మధ్య దృఢమైన సంబంధాలను, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి ఆసక్తిని వ్యక్త పరిచారు. ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరం చేయడంలో ప్రతినిధుల మండలి పాత్రను కొనియాడుతూ బహ్రెయిన్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు పరస్పర ఆసక్తిని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రశంసించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







