స్పీకర్ అహ్మద్ తో సమావేశమైన భారత రాయబారి పీయూష్
- January 06, 2023
మనామా: కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లంతో బహ్రెయిన్ రాజ్యంలో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అహ్మద్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు, అన్ని స్థాయిలలో శాశ్వత వృద్ధిని ప్రశంసించారు. ఆసియా ఖండం అభివృద్ధిలో భారతదేశం పోషించిన కీలక పాత్రను కొనియాడారు. భారతదేశం-గల్ఫ్ మధ్య దృఢమైన సంబంధాలను, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి ఆసక్తిని వ్యక్త పరిచారు. ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరం చేయడంలో ప్రతినిధుల మండలి పాత్రను కొనియాడుతూ బహ్రెయిన్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు పరస్పర ఆసక్తిని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









