చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న అడివి శేషు..
- January 08, 2023
హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్లో అడివి శేషు ఒకడు. ఆక్టర్గా, రైటర్గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. గూఢచారి సినిమాతో మొదలైన తన విజయ పరంపరాని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు. గత ఏడాదిలో ఈ హీరో ‘మేజర్’, ‘హిట్-2’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకున్నాడు. తాజాగా అడివి శేషు తన అభిమాన హీరో చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
ముంబై తాజ్ హోటల్ ఉగ్రవాదులను ఎదిరించి పోరాడిన ‘మేజర్ ఉన్ని కృష్ణన్’ బయోపిక్ ని ‘మేజర్’గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అడివి శేషు చాలా కష్టపడ్డాడు. నటుడు గానే కాదు రైటర్ గా కూడా ఈ సినిమా విజయంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. కాగా ప్రతి ఏటా టాలీవుడ్ యాక్టర్స్ కి సంతోషం అవార్డ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పురస్కారాల్లో అడివి శేషు మేజర్ సినిమాకు గాను అవార్డుని అందుకున్నాడు.
ఆ అవార్డుని చిరు చేతులు మీదగా అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో.. ‘చిన్నప్పుడు మీ సినిమా టికెట్లు కోసం కొట్టుకునే వాళ్ళం.అలాంటి మీరు ఒక హాఫ్ డే అంతా మా మేజర్ సినిమా గురించి మాట్లాడడం నాకు చాల గర్వంగా ఉంది. ఇక ఇప్పుడు మీ చేతులు మీదగా ఆ సినిమాకి అవార్డుని అందుకోవడం నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అవార్డుని అందుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.
తాజా వార్తలు
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్







