ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్ముకున్న పొగ మంచు..
- January 09, 2023
న్యూ ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను పొగ మంచు కమ్మేస్తోంది.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది.పొగమంచు ప్రభావం రవాణా వ్యవస్థపై పడుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంను పొగమంచు కమ్మేసింది.
దీంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు విమానాశ్రయంలోనే నిలిచిపోయాయి.దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.విమానాశ్రయం పరిధిలో దారి కనిపించకపోవడంతో మూడు విమానాలను అధికారులు దారి మళ్లించారు. షార్జా నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంతోపాటు, అహ్మదాబాద్, పూనేల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాల్ని జైపూర్ పంపించారు.
భారత వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. పంజాబ్, రాజస్థాన్, బిహార్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లో పొగ మంచు పొరలాగా కమ్ముకున్నట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పొగ మంచు ప్రభావంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ఈ విషయం పై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని, దీనికోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ రేటు ఉదయం ఐదున్నర గంటల సమయంలో 0 మీటర్లుగా ఉందంటే అక్కడి పరిస్థితిని అంచనావేయొచ్చు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







