హిస్టరీ రిపీట్ అవ్వనుంద
- April 28, 2016
మహేశ్బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి', 'బిజినెస్మేన్' చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఈ ఏప్రిల్ 28కి 'పోకిరి' విడుదలై పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా మహేశ్బాబు హీరోగా తాను చేయనున్న చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా పూరి గురువారం రాత్రి ప్రకటించారు. '''పోకిరి' విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా మహేశ్తో నా తదుపరి చిత్రాన్ని ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను. మహేశ్ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఈసారి 'పోకిరి'కన్నా ఇంకా రూత్ లెస్గా, 'బిజినెస్మేన్'కన్నా ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు మహేశ్'' అని పూరి తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. అలాగే 'జన గణ మన' అనే టైటిల్తో, మన జాతీయ జెండా, మహేశ్ కళ్లతో ఓ డిజైన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







