2022లో 80వేల యూఏఈ గోల్డెన్ వీసాలు జారీ
- January 14, 2023
యూఏఈ: విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాలు ఇస్తోంది.5,10 ఏళ్ల పరిమితితో ఈ వీసాలను జారీ చేస్తోంది.వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారు, పెట్టుబడిదారులు, ఇతర కేటగిరీల వారికి ఇలా యేటా భారీ సంఖ్యలో గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగా 2022లో 80వేల వరకు వీసాలు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ వెల్లడించింది.
జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) సమాచారం ప్రకారం అన్ని కేటగిరీలకు కలిపి 79,617 గోల్డెన్ వీసాలు జారీ చేసినట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది (2021) ఈ సంఖ్య 47,150 మాత్రమే. అంటే 2022లో దాదాపు రెట్టింపు అయింది. అలాగే గతేడాది డైరెక్టరేట్ మొత్తంగా 62.24 మిలియన్ల ట్రాన్సక్షన్స్ చేసింది. ఇందులో 46,965,715 ఎంట్రీ, ఎగ్జిట్ (వాయు, రోడ్డు, సముద్ర ప్రయాణాలకు సంబంధించినవి) ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. అలాగే వీసా (9,852,218 ), రెసిడెన్సీ (4,499,712), ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ (40,642), లీగల్ కన్సల్టేషన్స్ (37,267) ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. ఇక జీడీఆర్ఎఫ్ఏ దాని కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలో 99 శాతం సక్సెస్ రేటును సాధించింది. అలాగే కస్టమర్ హ్యాపీనెస్ ఇండెక్స్ 96 శాతం దాటగా.. భాగస్వామి హ్యాపీనెస్ ఇండెక్స్ 100 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ









