ఎమిరాటీ రైతులపై ప్రశంసలు కురిపించిన షేక్ హమ్దాన్
- January 14, 2023
యూఏఈ: వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తున్న ఎమిరాటీ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్, అభివృద్ధి, పౌరుల వ్యవహారాల ఉన్నత కమిటీ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రశంసలు కురిపించారు. పామ్ పార్క్స్లో జరుగుతున్న రైతుల సౌఖ్ రెండో సీజన్ను ఆయన సందర్శించారు. తమ ఆహార భద్రతా వ్యూహం లక్ష్యాలను సాధిస్తూ.. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా స్థానిక వినియోగదారుల డిమాండ్ను తీర్చడం చాలా ముఖ్యమైనదని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. సుస్థిర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం నాయకత్వం ముఖ్య ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. దుబాయ్ మునిసిపాలిటీ ప్రారంభించిన ఫార్మర్స్ సౌక్ ఉచిత వ్యవసాయ, సామాజిక, పెట్టుబడి వేదిక. ఇది ఎమిరాటీ రైతులను ఒకే వేదిక దగ్గరకు చేర్చి స్థానిక ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. ఈ మార్కెట్ మార్చి 11, 2023 వరకు పామ్ పార్క్స్లో ప్రతి శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







