దేశీయ యాత్రికుల కోటాపై హజ్ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు
- January 16, 2023
రియాద్ : ప్రస్తుతం సౌదీ అరేబియాలో నివసిస్తున్న జీసీసీ దేశాల హజ్ యాత్రికులు ఈ సంవత్సరం హజ్ సీజన్లో కంపెనీలు, దేశీయ యాత్రికుల సంస్థలకు కేటాయించిన సీట్లలో నమోదు చేసుకోలేరని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. గల్ఫ్ పౌరులు తమ దేశాల మిషన్ల ద్వారా హజ్ కోసం నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సంవత్సరం హజ్ కోసం రిజిస్టర్ చేసుకోవడం కోసం సౌదీ ID లేదా చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ (ఇకామా) ఉన్న యాత్రికుల కోసం మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలని, ఇది ఈ నెల 17వ తేదీ(ధుల్ హిజ్జా 1444)తో ముగుస్తుందని తెలిపింది. గత సంవత్సరాల్లో హజ్ చేసిన యాత్రికులు ఈ సీజన్లో భర్తగా, సోదరుడిగా, తండ్రిగా లేదా కొడుకుగా స్త్రీల పురుషుల సంరక్షకులుగా (మహ్రమ్) నమోదు చేసుకోవచ్చన్నారు. హజ్ యాత్రికులు రిజర్వేషన్ బుక్ చేసుకున్న తర్వాత హజ్ సౌకర్యాన్ని మార్చుకోలేరని మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ప్యాకేజీల నుండి జంతు బలి (అదాహి, హదీ) కొనుగోలు ఆప్షన్ ని తొలగించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







