బిల్డింగ్ పై నుంచి పడ్డ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
- January 16, 2023
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల మూడో అంతస్థు నుంచి కింద పడిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్,బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్మెంట్లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్లో ఉంటున్న కస్టమర్కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు. అయితే, వాళ్ల ఫ్లాట్ నుంచి జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క గట్టిగా అరుస్తూ , రిజ్వాన్పైకి దూసుకొచ్చింది. ఈ కుక్కను తప్పించుకునే క్రమంలో రిజ్వాన్ మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు.
ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆ కుక్క యజమాని, కస్టమర్ అయిన వ్యక్తి రిజ్వాన్ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందిన రిజ్వాన్ ఆదివారం మరణించాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రిజ్వాన్ మరణం పై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని రిజ్వాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







