బిల్డింగ్ పై నుంచి పడ్డ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
- January 16, 2023
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల మూడో అంతస్థు నుంచి కింద పడిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్,బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్మెంట్లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్లో ఉంటున్న కస్టమర్కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు. అయితే, వాళ్ల ఫ్లాట్ నుంచి జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క గట్టిగా అరుస్తూ , రిజ్వాన్పైకి దూసుకొచ్చింది. ఈ కుక్కను తప్పించుకునే క్రమంలో రిజ్వాన్ మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు.
ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆ కుక్క యజమాని, కస్టమర్ అయిన వ్యక్తి రిజ్వాన్ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందిన రిజ్వాన్ ఆదివారం మరణించాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రిజ్వాన్ మరణం పై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని రిజ్వాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







