బిల్డింగ్ పై నుంచి పడ్డ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
- January 16, 2023
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల మూడో అంతస్థు నుంచి కింద పడిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్,బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్మెంట్లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్లో ఉంటున్న కస్టమర్కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు. అయితే, వాళ్ల ఫ్లాట్ నుంచి జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క గట్టిగా అరుస్తూ , రిజ్వాన్పైకి దూసుకొచ్చింది. ఈ కుక్కను తప్పించుకునే క్రమంలో రిజ్వాన్ మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు.
ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆ కుక్క యజమాని, కస్టమర్ అయిన వ్యక్తి రిజ్వాన్ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందిన రిజ్వాన్ ఆదివారం మరణించాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రిజ్వాన్ మరణం పై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని రిజ్వాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









