పదేళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేసిన తండ్రికి Dh11,000 జరిమానా
- January 18, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో 10 ఏళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేయడంతోపాటు తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కుతుండగా బలవంతంగా ఈడ్చుకెళ్లినందుకు ఓ తండ్రిని రస్ అల్ ఖైమా కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి Dh11,000 జరిమానా విధించడంతోపాటు కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తనకు జరిగిన నైతిక, భౌతిక నష్టాలకు 60,000 దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు వ్యక్తి మాజీ భార్య కోర్టులో దావా వేసింది. అయితే, నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలను వినిపించారు. తన క్లయింట్ తన కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని, కానీ అతని మాజీ భార్య కోర్టు రూలింగ్కు కట్టుబడి ఉండకపోవడమే కాకుండా నివాసాన్ని సైతం మార్చారని, ఇదే ఘటనకు మూల కారణమని కోర్టుకు తెలిపారు. కాగా, సదరు వ్యక్తి దాడిలో 10 ఏళ్ల కొడుకు, అతని మాజీ భార్యకు తీవ్రమైన గాయాలు అయినట్లు వైద్య నివేదిక స్పష్టం చేయడంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జరిమానా విధించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







