పదేళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేసిన తండ్రికి Dh11,000 జరిమానా
- January 18, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో 10 ఏళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేయడంతోపాటు తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కుతుండగా బలవంతంగా ఈడ్చుకెళ్లినందుకు ఓ తండ్రిని రస్ అల్ ఖైమా కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి Dh11,000 జరిమానా విధించడంతోపాటు కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తనకు జరిగిన నైతిక, భౌతిక నష్టాలకు 60,000 దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు వ్యక్తి మాజీ భార్య కోర్టులో దావా వేసింది. అయితే, నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలను వినిపించారు. తన క్లయింట్ తన కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని, కానీ అతని మాజీ భార్య కోర్టు రూలింగ్కు కట్టుబడి ఉండకపోవడమే కాకుండా నివాసాన్ని సైతం మార్చారని, ఇదే ఘటనకు మూల కారణమని కోర్టుకు తెలిపారు. కాగా, సదరు వ్యక్తి దాడిలో 10 ఏళ్ల కొడుకు, అతని మాజీ భార్యకు తీవ్రమైన గాయాలు అయినట్లు వైద్య నివేదిక స్పష్టం చేయడంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జరిమానా విధించింది.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







