పదేళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేసిన తండ్రికి Dh11,000 జరిమానా
- January 18, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో 10 ఏళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేయడంతోపాటు తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కుతుండగా బలవంతంగా ఈడ్చుకెళ్లినందుకు ఓ తండ్రిని రస్ అల్ ఖైమా కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి Dh11,000 జరిమానా విధించడంతోపాటు కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తనకు జరిగిన నైతిక, భౌతిక నష్టాలకు 60,000 దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు వ్యక్తి మాజీ భార్య కోర్టులో దావా వేసింది. అయితే, నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలను వినిపించారు. తన క్లయింట్ తన కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని, కానీ అతని మాజీ భార్య కోర్టు రూలింగ్కు కట్టుబడి ఉండకపోవడమే కాకుండా నివాసాన్ని సైతం మార్చారని, ఇదే ఘటనకు మూల కారణమని కోర్టుకు తెలిపారు. కాగా, సదరు వ్యక్తి దాడిలో 10 ఏళ్ల కొడుకు, అతని మాజీ భార్యకు తీవ్రమైన గాయాలు అయినట్లు వైద్య నివేదిక స్పష్టం చేయడంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జరిమానా విధించింది.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









