పదేళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేసిన తండ్రికి Dh11,000 జరిమానా
- January 18, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో 10 ఏళ్ల కొడుకు, మాజీ భార్యపై దాడి చేయడంతోపాటు తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కుతుండగా బలవంతంగా ఈడ్చుకెళ్లినందుకు ఓ తండ్రిని రస్ అల్ ఖైమా కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి Dh11,000 జరిమానా విధించడంతోపాటు కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తనకు జరిగిన నైతిక, భౌతిక నష్టాలకు 60,000 దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు వ్యక్తి మాజీ భార్య కోర్టులో దావా వేసింది. అయితే, నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలను వినిపించారు. తన క్లయింట్ తన కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని, కానీ అతని మాజీ భార్య కోర్టు రూలింగ్కు కట్టుబడి ఉండకపోవడమే కాకుండా నివాసాన్ని సైతం మార్చారని, ఇదే ఘటనకు మూల కారణమని కోర్టుకు తెలిపారు. కాగా, సదరు వ్యక్తి దాడిలో 10 ఏళ్ల కొడుకు, అతని మాజీ భార్యకు తీవ్రమైన గాయాలు అయినట్లు వైద్య నివేదిక స్పష్టం చేయడంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జరిమానా విధించింది.
తాజా వార్తలు
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ







