‘వీరయ్య’ నుంచి ‘భోళా శంకర్’గా ప్రమోట్ అయిన మెగాస్టార్.!
- January 18, 2023
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్గ్గా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘వీరయ్య’గా మళ్లీ ట్రెండ్ సృష్టించారు మెగాస్టార్.
ఈ ట్రెండ్ని అలా కంటిన్యూ చేసేలా ఆ మేనియా ఇంకా ముగియకుండానే తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్’ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ బ్లాక్ బాస్టర్ ‘వేదాళం’ కి రీమేక్గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్కి చెల్లెలిగా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ఆల్రెడీ 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది.
శరవేగంగా సినిమాని పూర్తి చేసి, సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిరంజీవి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









