రష్మికకు ‘మిషన్ మజ్ను’ మరో ‘సీతారామం’ అవుతుందా.?
- January 18, 2023
ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ విశేషంగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.
యుద్ధం కలిపిన ప్రేమ అనే ట్యాగ్తో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మండన్నా కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు రష్మిక మండన్నా హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ ఈ నెల 20న రిలీజ్కి సిద్ధంగా వుంది. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఆర్మీ అండ్ లవ్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రూపొందిందని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. దాంతో, ఈ సినిమా మరో ‘సీతారామం’ అవుతుందని అనుకుంటున్నారట.
ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో. రష్మిక, సిద్దార్ధ్ జంట చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది. అన్నట్లు రష్మిక సైన్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రం ఇదేనట.
రిలీజ్ లేట్ అయిన కారణంగా అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘గుడ్ బై’ చిత్రం ముందుగా రిలీజైపోయింది. ఓటీటీలో రిలీజవుతుండడం వల్ల ఎక్కువ రీచ్ వుంటుంది. అది రష్మికకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- రాలీలో కన్నులపండువగా శ్రీ సీతారామ కళ్యాణం
- వన్యప్రాణుల సంరక్షణలో భారత్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి
- హైదరాబాద్లో జూలై 15–16 తేదీల్లో DM–CX–Loyalty Summit 2026
- అల్ వాబ్ ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్య సేవలు ప్రారంభం..!!
- పారిశ్రామిక సంబంధాల బలోపేతంపై సౌదీ, జోర్డాన్ చర్చలు..!!
- అబుదాబి అత్యవసర వాహనాలపై స్మార్ట్ కెమెరాలు..!!
- 'ఐ లవ్ బహ్రెయిన్' ఫోటోగ్రఫీ కాంపిటీషన్..!!
- కువైట్ లో మనీలాండరింగ్ కేసు..నిందితుడిని అప్పగించిన యూఏఈ..!!
- ఈద్ హబ్తా మార్కెట్ కోసం కొత్త నిబంధనలు జారీ..!!









