రష్మికకు ‘మిషన్ మజ్ను’ మరో ‘సీతారామం’ అవుతుందా.?
- January 18, 2023
ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ విశేషంగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.
యుద్ధం కలిపిన ప్రేమ అనే ట్యాగ్తో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మండన్నా కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు రష్మిక మండన్నా హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ ఈ నెల 20న రిలీజ్కి సిద్ధంగా వుంది. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఆర్మీ అండ్ లవ్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రూపొందిందని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. దాంతో, ఈ సినిమా మరో ‘సీతారామం’ అవుతుందని అనుకుంటున్నారట.
ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో. రష్మిక, సిద్దార్ధ్ జంట చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది. అన్నట్లు రష్మిక సైన్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రం ఇదేనట.
రిలీజ్ లేట్ అయిన కారణంగా అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘గుడ్ బై’ చిత్రం ముందుగా రిలీజైపోయింది. ఓటీటీలో రిలీజవుతుండడం వల్ల ఎక్కువ రీచ్ వుంటుంది. అది రష్మికకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







