రష్మికకు ‘మిషన్ మజ్ను’ మరో ‘సీతారామం’ అవుతుందా.?
- January 18, 2023
ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ విశేషంగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.
యుద్ధం కలిపిన ప్రేమ అనే ట్యాగ్తో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మండన్నా కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు రష్మిక మండన్నా హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ ఈ నెల 20న రిలీజ్కి సిద్ధంగా వుంది. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఆర్మీ అండ్ లవ్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రూపొందిందని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. దాంతో, ఈ సినిమా మరో ‘సీతారామం’ అవుతుందని అనుకుంటున్నారట.
ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో. రష్మిక, సిద్దార్ధ్ జంట చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది. అన్నట్లు రష్మిక సైన్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రం ఇదేనట.
రిలీజ్ లేట్ అయిన కారణంగా అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘గుడ్ బై’ చిత్రం ముందుగా రిలీజైపోయింది. ఓటీటీలో రిలీజవుతుండడం వల్ల ఎక్కువ రీచ్ వుంటుంది. అది రష్మికకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









