సుఖేష్ చేతిలో అలా మోసపోయానంటోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.!
- January 19, 2023
200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్ వలలో పడిన అందాల భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్.. ఆ చిక్కుల్లోంచి బయటికి రాలేక గిల గిలా కొట్టుకుంటోంది.
తాజాగా ఢిల్లీ కోర్టులో ఫిటిషన్ సమర్పించిన జాక్వెలీన్, సుఖేష్ కారణంగా తన జీవితం నాశనమైపోయిందనీ తెలిపింది. సుఖేష్ తనను తాను ఓ గవర్నమెంట్ అధికారిగా పరిచయం చేసుకున్నాడని పిటిషన్లో పేర్కొంది.
తన మేకప్ అసిస్టెంట్కి స్నేహితురాలైన పింకీ ద్వారా సుఖేష్తో పరిచయం ఏర్పడిందనీ, ఆమె తనను మోసం చేసి, సుఖేష్ వలలో చిక్కేలా చేసిందనీ వాపోయింది. తనకు పరిచయం అయ్యేటప్పటికి సుఖేష్ గురించి ఏమీ తెలియదని, తనకు అభిమానినంటూ దగ్గరయ్యాడనీ, ఆ తర్వాతే అతను జైలులో వున్నట్లు తెలిసిందనీ జాక్వెలీన్ పిటీషన్లో పేర్కొంది.
ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇస్తున్నప్పుడూ, ప్రత్యేక విమానాల్లో తిప్పుతున్నప్పుడే అనుమానం వచ్చి, ఆరా తీయగా, తాను సన్ టీవీ యజమానిని అని మరో అబద్దం చెప్పాడట. తనతో ఓ సినిమా తీస్తానని నమ్మబలికాడట. అలా సుఖేష్ వలలో పడిన జాక్వెలీన్ ఇప్పుడు లబోదిబోమంటోంది.
తాజా వార్తలు
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!







