శృతిహాసన్ పై ‘వీర సింహారెడ్డి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- January 19, 2023
గోపీచంద్ మలినేనితో శృతిహాసన్కి లవ్వంట. అందుకే పబ్లిగ్గా స్టేజ్పై ‘ఐ లవ్ యూ’ చెప్పేశాడు.. అంటూ సోషల్ మీడియాలో ఇటు శృతిహాసన్కీ, అటు డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి లింకులు అంటగట్టేసి వార్తలు వైరల్ చేసేశారు.
కట్ చేస్తే, గోపీచంద్ మలినేని ఈ ప్రచారంపై తన స్పందన తెలియజేశారు. శృతి హాసన్ తనకెంతో ఇష్టమైన హీరోయిన్ అనీ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెతో కలిసి మూడు సినిమాలు తెరకెక్కించాననీ చాలా కంఫర్టబుల్ హీరోయిన్ అనీ తెలిపారు.
‘బలుపు’, ‘క్రాక్’, ఇప్పుడు ‘వీర సింహారెడ్డి’.. ఇలా మూడు సినిమాలు తెరకెక్కించిన హీరోయిన్తో కాస్త చనువు ఎక్కువగా వుండడం సహజమే. అలాగే, శృతి హాసన్ తనకు ఫ్యామిలీ మెంబర్ లెక్క.. తన భార్య, కుమారుడికీ కూడా శృతి చాలా క్లోజ్ అని ఆయన తెలిపారు. అంతేకాదు, ఓ చెల్లెలి లెక్క. అన్నయ్యా.. అని శృతి తనను సంబోధిస్తుందనీ.. ఆ క్రమంలోనే చెల్లెలిపై కన్సాన్ చూపించాననీ, తల్లికీ, చెల్లికీ చెప్పినట్లే ఐ లవ్ యూ చెప్పాననీ.. అందులో ఇంతలా పెడార్ధాలు తీసేశారనీ ఆయన తాజాగా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు.
గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయ్.
తాజా వార్తలు
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ









