శృతిహాసన్ పై ‘వీర సింహారెడ్డి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- January 19, 2023
గోపీచంద్ మలినేనితో శృతిహాసన్కి లవ్వంట. అందుకే పబ్లిగ్గా స్టేజ్పై ‘ఐ లవ్ యూ’ చెప్పేశాడు.. అంటూ సోషల్ మీడియాలో ఇటు శృతిహాసన్కీ, అటు డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి లింకులు అంటగట్టేసి వార్తలు వైరల్ చేసేశారు.
కట్ చేస్తే, గోపీచంద్ మలినేని ఈ ప్రచారంపై తన స్పందన తెలియజేశారు. శృతి హాసన్ తనకెంతో ఇష్టమైన హీరోయిన్ అనీ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెతో కలిసి మూడు సినిమాలు తెరకెక్కించాననీ చాలా కంఫర్టబుల్ హీరోయిన్ అనీ తెలిపారు.
‘బలుపు’, ‘క్రాక్’, ఇప్పుడు ‘వీర సింహారెడ్డి’.. ఇలా మూడు సినిమాలు తెరకెక్కించిన హీరోయిన్తో కాస్త చనువు ఎక్కువగా వుండడం సహజమే. అలాగే, శృతి హాసన్ తనకు ఫ్యామిలీ మెంబర్ లెక్క.. తన భార్య, కుమారుడికీ కూడా శృతి చాలా క్లోజ్ అని ఆయన తెలిపారు. అంతేకాదు, ఓ చెల్లెలి లెక్క. అన్నయ్యా.. అని శృతి తనను సంబోధిస్తుందనీ.. ఆ క్రమంలోనే చెల్లెలిపై కన్సాన్ చూపించాననీ, తల్లికీ, చెల్లికీ చెప్పినట్లే ఐ లవ్ యూ చెప్పాననీ.. అందులో ఇంతలా పెడార్ధాలు తీసేశారనీ ఆయన తాజాగా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు.
గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయ్.
తాజా వార్తలు
- జైలు అంటే శిక్ష మాత్రమే కాదు..సంస్కరణకు కేంద్రంగా మారాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- $6.6 మిలియన్ల బదిలీ ప్రయత్నాన్ని అడ్డుకున్న ROP..!!
- యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- సబా అల్-అహ్మద్లోని అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..!!
- యూఏఈలో స్కిన్ కేర్ ట్రెండ్లపై పేరెంట్స్ కు వార్నింగ్..!!
- గల్ఫ్ ఐక్యతను చాటిచెప్పిన దోహా జీసీసీ గేమ్స్ ప్రారంభోత్సవం..!!
- రాస్ అల్ ఖైమా డ్యామ్లో జారిపడి యువకుడు మృతి..!!
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









