శృతిహాసన్ పై ‘వీర సింహారెడ్డి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- January 19, 2023
గోపీచంద్ మలినేనితో శృతిహాసన్కి లవ్వంట. అందుకే పబ్లిగ్గా స్టేజ్పై ‘ఐ లవ్ యూ’ చెప్పేశాడు.. అంటూ సోషల్ మీడియాలో ఇటు శృతిహాసన్కీ, అటు డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి లింకులు అంటగట్టేసి వార్తలు వైరల్ చేసేశారు.
కట్ చేస్తే, గోపీచంద్ మలినేని ఈ ప్రచారంపై తన స్పందన తెలియజేశారు. శృతి హాసన్ తనకెంతో ఇష్టమైన హీరోయిన్ అనీ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెతో కలిసి మూడు సినిమాలు తెరకెక్కించాననీ చాలా కంఫర్టబుల్ హీరోయిన్ అనీ తెలిపారు.
‘బలుపు’, ‘క్రాక్’, ఇప్పుడు ‘వీర సింహారెడ్డి’.. ఇలా మూడు సినిమాలు తెరకెక్కించిన హీరోయిన్తో కాస్త చనువు ఎక్కువగా వుండడం సహజమే. అలాగే, శృతి హాసన్ తనకు ఫ్యామిలీ మెంబర్ లెక్క.. తన భార్య, కుమారుడికీ కూడా శృతి చాలా క్లోజ్ అని ఆయన తెలిపారు. అంతేకాదు, ఓ చెల్లెలి లెక్క. అన్నయ్యా.. అని శృతి తనను సంబోధిస్తుందనీ.. ఆ క్రమంలోనే చెల్లెలిపై కన్సాన్ చూపించాననీ, తల్లికీ, చెల్లికీ చెప్పినట్లే ఐ లవ్ యూ చెప్పాననీ.. అందులో ఇంతలా పెడార్ధాలు తీసేశారనీ ఆయన తాజాగా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు.
గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయ్.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







