ధోఫర్ గవర్నరేట్‌లో మంటలను ఆర్పిన సీడీఏఏ

- January 21, 2023 , by Maagulf
ధోఫర్ గవర్నరేట్‌లో మంటలను ఆర్పిన సీడీఏఏ

మస్కట్‌: దోఫర్‌ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లోని పొలంలో చెలరేగిన మంటలను ఆర్పినట్లు సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. "ధోఫర్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ అగ్నిమాపక బృందాలు సలాలా విలాయత్‌లోని అవ్కాద్ ప్రాంతంలోని ఒక పొలంలో గడ్డి మంటలను ఆర్పాయి" అని సీడీఏఏ  తెలిపింది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేసింది. గడ్డి మంటలు త్వరగా వ్యాపించగలవని, గడ్డిని వీలయినంత త్వరగా కత్తిరించడమో లేదా పశువులను మేపాలని సూచించింది. మంటలు చెలరేగిన సమయంలో జంతువులను దూరంగా తరలించాలి. అగ్నిమాపక పరికరాలు అన్ని సందర్భాల్లో పనిచేసేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. అగ్నిమాపక వాహనం వచ్చేందుకు సరైన దారిని ఏర్పాటు చేయాలని సీడీఏఏ రైతులకు సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com