యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి Dhs100,000 జరిమానా, ఏడాది జైలు
- January 22, 2023
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగల విధులకు ఆటంకం కలిగించినా.. దాడులకు పాల్పడిన వారికి Dhs100,000 వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష విధించనున్నారు. ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP)తన సోషల్ మీడియా ఖాతాలలో పబ్లిక్ ఉద్యోగులపై దాడికి సంబంధించిన జరిమానా, జైలుశిక్ష గురించి తెలిపే పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. నేరాలు, జరిమానాలపై ఫెడరల్ డిక్రీ-లా నెం.31 2021లోని ఆర్టికల్ 297 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా, హింసాత్మకంగా లేదా బెదిరింపులకు ఎవరైనా దిగితే.. ఆరు నెలల కంటే తక్కువ కాకుండా జైలుశిక్ష, Dhs100,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపింది. ఈ పోస్ట్ కమ్యూనిటీ సభ్యులలో చట్టపరమైన సంస్కృతిని ప్రోత్సహించడానికి, దేశంలోని తాజా చట్టం గురించి అవగాహనను పెంచడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ పోస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







