యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి Dhs100,000 జరిమానా, ఏడాది జైలు
- January 22, 2023
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగల విధులకు ఆటంకం కలిగించినా.. దాడులకు పాల్పడిన వారికి Dhs100,000 వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష విధించనున్నారు. ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP)తన సోషల్ మీడియా ఖాతాలలో పబ్లిక్ ఉద్యోగులపై దాడికి సంబంధించిన జరిమానా, జైలుశిక్ష గురించి తెలిపే పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. నేరాలు, జరిమానాలపై ఫెడరల్ డిక్రీ-లా నెం.31 2021లోని ఆర్టికల్ 297 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా, హింసాత్మకంగా లేదా బెదిరింపులకు ఎవరైనా దిగితే.. ఆరు నెలల కంటే తక్కువ కాకుండా జైలుశిక్ష, Dhs100,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపింది. ఈ పోస్ట్ కమ్యూనిటీ సభ్యులలో చట్టపరమైన సంస్కృతిని ప్రోత్సహించడానికి, దేశంలోని తాజా చట్టం గురించి అవగాహనను పెంచడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ పోస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







