అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు పేర్లు పెట్టిన ప్రధాని మోడీ
- January 23, 2023న్యూఢిల్లీ: నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు ప్రధాని నామకరణం చేశారు. ఈ 21 దీవులకు పరమవీరచక్ర పురస్కారాలను అందుకున్న 21 మంది పేర్లను పెట్టారు.
ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ శేఖన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయిబ్ సుబేదార్ బానా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్ లాన్స్ నాయక్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్, హవల్దార్ పీరూ సింగ్, కెప్టెన్ జీఎస్ సలేరియా, లెఫ్టినెంట్ కల్నల్ ధాన్ సింగ్ తప్పా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ శైతాన్ సింగ్, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్దేశిర్ బుర్జోరీ తారాపోర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజరల్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్ ల పేర్లను 21 దీవులకు పెట్టారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్