25 ఎకరాల్లో.... 23 అంతస్థులతో నిర్మాణం
- April 30, 2016
ఏపీ ఎన్నారైలకు శుభవార్త. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లో ఉంటూ పాటుపడుతున్న ఎన్నారైల కోసం రాజధానిలో ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 25 ఎకరాల్లో 23 అంతస్థులతో నిర్మించబోయే ఈ భవనం ఇంగ్లీషు లెటర్ ‘A’ ఆకారంలో ఉండనుంది. దీనికోసం సమారు 150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నారై వ్యవహారాల సలహాదారు వేమూరి రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భవనాల పక్కను నిర్మించే ఈ భవనంలో ఓ రెస్టారెంట్, విదేశాల్లోని ఎన్నారైలతో నేరుగా సంభాషించగల ఆడిటోరియం ఉంటాయన్నారు. దీనికోసం ఎన్నారైల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. ఈ భవనంలో అన్ని ఎన్నారై సంఘాల ప్రాతినిధ్యం ఉండేట్లు కృషి చేస్తామని రవి తెలిపారు
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







