25 ఎకరాల్లో.... 23 అంతస్థులతో నిర్మాణం
- April 30, 2016
ఏపీ ఎన్నారైలకు శుభవార్త. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లో ఉంటూ పాటుపడుతున్న ఎన్నారైల కోసం రాజధానిలో ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 25 ఎకరాల్లో 23 అంతస్థులతో నిర్మించబోయే ఈ భవనం ఇంగ్లీషు లెటర్ ‘A’ ఆకారంలో ఉండనుంది. దీనికోసం సమారు 150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నారై వ్యవహారాల సలహాదారు వేమూరి రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భవనాల పక్కను నిర్మించే ఈ భవనంలో ఓ రెస్టారెంట్, విదేశాల్లోని ఎన్నారైలతో నేరుగా సంభాషించగల ఆడిటోరియం ఉంటాయన్నారు. దీనికోసం ఎన్నారైల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. ఈ భవనంలో అన్ని ఎన్నారై సంఘాల ప్రాతినిధ్యం ఉండేట్లు కృషి చేస్తామని రవి తెలిపారు
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..