25 ఎకరాల్లో.... 23 అంతస్థులతో నిర్మాణం

- April 30, 2016 , by Maagulf
25 ఎకరాల్లో.... 23 అంతస్థులతో నిర్మాణం


 ఏపీ ఎన్నారైలకు శుభవార్త. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లో ఉంటూ పాటుపడుతున్న ఎన్నారైల కోసం రాజధానిలో ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 25 ఎకరాల్లో 23 అంతస్థులతో నిర్మించబోయే ఈ భవనం ఇంగ్లీషు లెటర్ ‘A’ ఆకారంలో ఉండనుంది. దీనికోసం సమారు 150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నారై వ్యవహారాల సలహాదారు వేమూరి రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భవనాల పక్కను నిర్మించే ఈ భవనంలో ఓ రెస్టారెంట్, విదేశాల్లోని ఎన్నారైలతో నేరుగా సంభాషించగల ఆడిటోరియం ఉంటాయన్నారు. దీనికోసం ఎన్నారైల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. ఈ భవనంలో అన్ని ఎన్నారై సంఘాల ప్రాతినిధ్యం ఉండేట్లు కృషి చేస్తామని రవి తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com