296 మంది ఎమిరాటీలను మోసం చేసిన ప్రైవేట్ సంస్థ యజమానికి జైలుశిక్ష
- January 25, 2023
యూఏఈ: 296 ఎమిరాటీలను మోసం చేసినందుకు ఒక ప్రైవేట్ కంపెనీ యజమాని, మేనేజర్కు జైలుశిక్ష విధిస్తూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నఫీస్ పథకంలో భాగంగా ట్రైనీలుగా చేరిన ఎమిరాటీస్ నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో నిందితులకు జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందుతులకు చెందిన సంస్థ ఎమిరాటీలకు శిక్షణ ఇవ్వడానికి నఫీస్ ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకుంది. వారు ట్రైనీలను "దాతృత్వ ప్రయోజనాల కోసం" బ్యాంక్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని కోరారు. వారు నిరాకరించినట్లయితే శిక్షణ మూల్యాంకనంలో 'విఫలం' చేస్తామని సంస్థ ట్రైనీలను బెదిరించింది. నఫీస్ పథకం అనేది ఎమిరాటీస్ పోటీతత్వాన్ని పెంచడానికి, దేశంలోని ప్రైవేట్ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను పొందడానికి ఉద్దేశించినది. ప్రైవేట్ రంగ కంపెనీలు నఫీస్ ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకోవచ్చు. ఎమిరాటీ ఉద్యోగార్ధుల కోసం ఖాళీలు, శిక్షణను అందించవచ్చు. దీనికి గాను మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. గత సంవత్సరం ఎమిరేటైజేషన్ విధానాలను ఉల్లంఘించినందుకు 20 సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







