296 మంది ఎమిరాటీలను మోసం చేసిన ప్రైవేట్ సంస్థ యజమానికి జైలుశిక్ష
- January 25, 2023
యూఏఈ: 296 ఎమిరాటీలను మోసం చేసినందుకు ఒక ప్రైవేట్ కంపెనీ యజమాని, మేనేజర్కు జైలుశిక్ష విధిస్తూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నఫీస్ పథకంలో భాగంగా ట్రైనీలుగా చేరిన ఎమిరాటీస్ నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో నిందితులకు జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందుతులకు చెందిన సంస్థ ఎమిరాటీలకు శిక్షణ ఇవ్వడానికి నఫీస్ ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకుంది. వారు ట్రైనీలను "దాతృత్వ ప్రయోజనాల కోసం" బ్యాంక్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని కోరారు. వారు నిరాకరించినట్లయితే శిక్షణ మూల్యాంకనంలో 'విఫలం' చేస్తామని సంస్థ ట్రైనీలను బెదిరించింది. నఫీస్ పథకం అనేది ఎమిరాటీస్ పోటీతత్వాన్ని పెంచడానికి, దేశంలోని ప్రైవేట్ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను పొందడానికి ఉద్దేశించినది. ప్రైవేట్ రంగ కంపెనీలు నఫీస్ ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకోవచ్చు. ఎమిరాటీ ఉద్యోగార్ధుల కోసం ఖాళీలు, శిక్షణను అందించవచ్చు. దీనికి గాను మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. గత సంవత్సరం ఎమిరేటైజేషన్ విధానాలను ఉల్లంఘించినందుకు 20 సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







