ప్రారంభానికి సిద్ధమైన దుబాయ్ పొడవైన రైలు వంతెన
- January 25, 2023
దుబాయ్: దుబాయ్లోని అతి పొడవైన రైలు వంతెన ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. అల్ ఖుద్రా వంతెన చిత్రాలను ఎతిహాద్ రైల్ పోస్ట్ చేసింది. "ఎమిరేట్ మెయిన్లైన్ నెట్వర్క్లో పొడవైనది" అని క్యాప్షన్ ఇచ్చింది. మానవ నిర్మిత సరస్సుల సమూహాన్ని కలిగి ఉన్న అల్ ఖుద్రా.. 86కిమీ సైక్లింగ్ ట్రాక్కు నిలయంగా ఉంది. గత వారం ఎతిహాద్ రైల్ ఖలీఫా పోర్ట్ను జాతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించే 1కిమీ మెరైన్ బ్రిడ్జి వివరాలను వెల్లడించింది. అలాగే గత సంవత్సరం ఎతిహాద్ రైల్ అనేక మైలురాళ్లను చేరుకుంది. 1,200 కి.మీ పొడవైన నెట్వర్క్ను 75 శాతం పూర్తి చేసింది. ఎతిహాద్ రైల్ ప్రయాణీకుల సేవలు యూఏఈలోని 11 నగరాలలో అందుబాటులో ఉన్నాయి. 200kmph గరిష్ట వేగంతో ప్రయాణీకులు అబుధాబి నుండి దుబాయ్కి 50 నిమిషాల్లో.. అబుధాబి నుండి ఫుజైరాకు 100 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఈ రైళ్లు ప్రయాణ సమయాలను 40 శాతం వరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రయాణీకుల సంఖ్య ఏటా 36.5 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







