ప్రారంభానికి సిద్ధమైన దుబాయ్ పొడవైన రైలు వంతెన
- January 25, 2023దుబాయ్: దుబాయ్లోని అతి పొడవైన రైలు వంతెన ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. అల్ ఖుద్రా వంతెన చిత్రాలను ఎతిహాద్ రైల్ పోస్ట్ చేసింది. "ఎమిరేట్ మెయిన్లైన్ నెట్వర్క్లో పొడవైనది" అని క్యాప్షన్ ఇచ్చింది. మానవ నిర్మిత సరస్సుల సమూహాన్ని కలిగి ఉన్న అల్ ఖుద్రా.. 86కిమీ సైక్లింగ్ ట్రాక్కు నిలయంగా ఉంది. గత వారం ఎతిహాద్ రైల్ ఖలీఫా పోర్ట్ను జాతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించే 1కిమీ మెరైన్ బ్రిడ్జి వివరాలను వెల్లడించింది. అలాగే గత సంవత్సరం ఎతిహాద్ రైల్ అనేక మైలురాళ్లను చేరుకుంది. 1,200 కి.మీ పొడవైన నెట్వర్క్ను 75 శాతం పూర్తి చేసింది. ఎతిహాద్ రైల్ ప్రయాణీకుల సేవలు యూఏఈలోని 11 నగరాలలో అందుబాటులో ఉన్నాయి. 200kmph గరిష్ట వేగంతో ప్రయాణీకులు అబుధాబి నుండి దుబాయ్కి 50 నిమిషాల్లో.. అబుధాబి నుండి ఫుజైరాకు 100 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఈ రైళ్లు ప్రయాణ సమయాలను 40 శాతం వరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రయాణీకుల సంఖ్య ఏటా 36.5 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు