తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
- January 25, 2023
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. 60 మంది ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేశారు.వనపర్తి, సిరిసిల్ల, మహబూబ్ నగర్, రామగుండం, కరీంనగర్ ఎస్పీలు, సీపీలు బదిలీ అయ్యారు.మల్కాజ్ గిరి డీసీపీగా జానకి దరావత్, రామగుండం సీపీగా సుబ్బారాయుడు, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్, ఉమెన్ సేఫ్టీ ఎస్పీగా పద్మజ, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్ బదిలీ అయ్యారు.
రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి.భారీగా అధికారులు ట్రాన్సఫర్ అయ్యారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చాక ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారు అనే దాని పై పూర్తిగా క్లారిటీ వస్తుంది. జనవరి 4న 29మంది ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ నెలలోనే ఐపీఎస్ ల బదిలీలు జరగడం ఇది రెండోసారి. లాంగ్ స్టాండింగ్ పీరియడ్ లో ఉన్నవారిని బదిలీలు చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి డీజీపీ అంజనీ కుమార్.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







