ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్కు మెరుగైన ఆదాయం
- January 25, 2023
హైదరాబాద్: భారత దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.248.6 కోట్ల అన్ ఆడిట్ రాబడిని నమోదు చేసినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. డిసెంబర్-22తో ముగిసిన ప్రస్తుత తొమ్మిది నెలల కాలంలో ఒలెక్ట్రా ఆదాయం రూ.766.0 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. ఇంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల కాలంలో నమోదైన ఆదాయం రూ. 317.3 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 141 శాతం పెరిగినట్లు వెల్లడించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 142 విద్యుత్ బస్సుల సరఫరా వల్ల మెరుగైన వృద్థిని సాధించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇంతక్రితం 2021 డిసెంబర్ త్రైమాసికంలో 103 బస్సులను పంపిణీ చేసినట్లు పేర్కొంది. 2021 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో తమ సంస్థ రూ.18.2 కోట్ల నికర లాభాలు ఆర్జించగా.. 2022 డిసెంబర్తో ముగిసిన మూడు త్రైమాసికాల్లో రూ.42.9 కోట్ల లాభాన్ని సాధించినట్లు తెలిపింది. క్రితం క్యూ3లో 136 శాతం వృద్థితో రూ.24.7 కోట్ల లాభాలను గడించినట్లు వెల్లడించింది. ''గత కొన్ని త్రైమాసికాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇవి మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఒలెక్ట్రా స్థిరమైన రాబడితో పాటు మార్జిన్ వద్ధి సాధించింది. బలమైన వ్యాపార పనితీరును ప్రదర్శించడం వల్లే ఇది సాధ్యమైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరపతిని కొనసాగిస్తామనే విశ్వాసం ఉంది. మిగిలిన ఆర్డర్లను సకాలంలో సరఫరా చేయడంపైనే దష్టి పెట్టాలని భావిస్తున్నాము.'' అని ఒలెక్ట్రా సిఎండి కెవి ప్రదీప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 5 అప్కమింగ్ వాట్సాప్ ఫీచర్లు
- నేటి నుండి ఏపీ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- ఒమన్లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- ముసందమ్లో భూకంపం
- ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖపట్నం ... బాంబు పేల్చిన సీఎం జగన్..!
- దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!