ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్కు మెరుగైన ఆదాయం
- January 25, 2023
హైదరాబాద్: భారత దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.248.6 కోట్ల అన్ ఆడిట్ రాబడిని నమోదు చేసినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. డిసెంబర్-22తో ముగిసిన ప్రస్తుత తొమ్మిది నెలల కాలంలో ఒలెక్ట్రా ఆదాయం రూ.766.0 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. ఇంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల కాలంలో నమోదైన ఆదాయం రూ. 317.3 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 141 శాతం పెరిగినట్లు వెల్లడించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 142 విద్యుత్ బస్సుల సరఫరా వల్ల మెరుగైన వృద్థిని సాధించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇంతక్రితం 2021 డిసెంబర్ త్రైమాసికంలో 103 బస్సులను పంపిణీ చేసినట్లు పేర్కొంది. 2021 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో తమ సంస్థ రూ.18.2 కోట్ల నికర లాభాలు ఆర్జించగా.. 2022 డిసెంబర్తో ముగిసిన మూడు త్రైమాసికాల్లో రూ.42.9 కోట్ల లాభాన్ని సాధించినట్లు తెలిపింది. క్రితం క్యూ3లో 136 శాతం వృద్థితో రూ.24.7 కోట్ల లాభాలను గడించినట్లు వెల్లడించింది. ''గత కొన్ని త్రైమాసికాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇవి మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఒలెక్ట్రా స్థిరమైన రాబడితో పాటు మార్జిన్ వద్ధి సాధించింది. బలమైన వ్యాపార పనితీరును ప్రదర్శించడం వల్లే ఇది సాధ్యమైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరపతిని కొనసాగిస్తామనే విశ్వాసం ఉంది. మిగిలిన ఆర్డర్లను సకాలంలో సరఫరా చేయడంపైనే దష్టి పెట్టాలని భావిస్తున్నాము.'' అని ఒలెక్ట్రా సిఎండి కెవి ప్రదీప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







