తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
- January 28, 2023
తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్పస్వామి వివహరించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహరించారు. ఆ తర్వాత చిన్నశేష వాహనంపై వివహరించారు.
ఉదయం 11 గంటలకు గరుడు వాహనంపై మలయప్పస్వామి విహరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటలకు వరకు హనుమంత వాహనంపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటల నుంచి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని ఈ రోజు ఏడు వాహనాలపై దర్శనం ఇవ్వనున్నారు. తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







