బహ్రెయిన్లో SMEలపై 348% పెరిగిన సైబర్ అటాక్స్
- January 30, 2023
బహ్రెయిన్: ఎవరైనా ఆన్లైన్లో ఉచిత బహుమతులు లేదా ఇతర ప్రోత్సాహకాలను ఆఫర్ చేసినప్పడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని, ఇది మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాల్లోకి నెట్టవచ్చని రాజ్యంలోని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద సందేశాలు లేదా ఫోన్ కాల్ల పట్ల అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం అని సూచిస్తున్నారు. గతేడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య బహ్రెయిన్లోని చిన్న వ్యాపారాలపై సైబర్ అటాక్లలో 348% పెరుగుదల నమోదైందని పరిశోధనా సంస్థ కాస్పెర్స్కీ వెల్లడించింది. 2022 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా 236.1 మిలియన్ల సైబర్ దాడులు జరిగాయని యూకే ఆధారిత AAG IT సర్వీసెస్ నివేదిక పేర్కొంది. NGN ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు,సీఈఓ యాకూబ్ అలవాది మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన బహ్రెయిన్ కూడా సైబర్ అటాక్ ల నుంచి తప్పించుకోలేదని పేర్కొన్నారు. మోసపూరిత సందేశాలు, అనుమానిత లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అటువంటి లింక్లను ఎప్పుడూ ట్యాప్ చేయవద్దని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







