అల్-ఖురయ్యత్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
- February 01, 2023
సౌదీ: అల్-ఖురయ్యత్ లో ఓ ఇంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందారు. ఇందులో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో సహా ఒక తండ్రి ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అధికారుల కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున అల్-జౌఫ్ ప్రాంతంలోని అల్-ఖురాయత్ గవర్నరేట్లోని తషీలత్ పరిసరాల్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అల్-ఖురయ్యత్లోని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఆపరేషన్ గదికి తెల్లవారుజామున 4:00 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముగ్గురు పిల్లలు సంఘటనా స్థలంలో చనిపోగా.. తండ్రి, ముగ్గురు పిల్లలు అల్-ఖురయ్యత్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, పిల్లల బెడ్రూమ్లోని గ్యాస్ హీటర్ నుండి మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ ముగ్గురు పిల్లలు చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







