యూకే-భారత్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొన్న యూకే ప్రధాని రిషి సునక్
- February 05, 2023
లండన్: యూకే జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బ్యూరోతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమావేశమై చర్చలు జరిపారు. ఇందులో ప్రత్యేకంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా పాల్గొనడం గమనార్హం. కొన్ని రోజులుగా అజిబ్ బోభాల్ విదేశాల్లో పర్యటిస్తున్నారు.
పలు దేశాల అధికారులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టిమ్ బ్యారోతో సమావేశమై ఇరు దేశాల భద్రత, వాణిజ్యం, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. ఆయా అంశాల్లో భారత్-యూకే బంధం బలపడడానికి రిషి సునక్ హామీ ఇచ్చారు. యూకే కేబినెట్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఇందులోనే రిషి సునక్ కూడా పాల్గొన్నారంటూ భారత హై కమిషన్ ట్విట్టర్ లో తెలిపింది. త్వరలోనే టిమ్ కూడా భారత్ లో పర్యటిస్తారని వివరించింది. గత మంగళవారం అమెరికాలో పర్యటించిన అజిత్ డోభాల్ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు