యూకే-భారత్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొన్న యూకే ప్రధాని రిషి సునక్
- February 05, 2023
లండన్: యూకే జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బ్యూరోతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమావేశమై చర్చలు జరిపారు. ఇందులో ప్రత్యేకంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా పాల్గొనడం గమనార్హం. కొన్ని రోజులుగా అజిబ్ బోభాల్ విదేశాల్లో పర్యటిస్తున్నారు.
పలు దేశాల అధికారులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టిమ్ బ్యారోతో సమావేశమై ఇరు దేశాల భద్రత, వాణిజ్యం, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. ఆయా అంశాల్లో భారత్-యూకే బంధం బలపడడానికి రిషి సునక్ హామీ ఇచ్చారు. యూకే కేబినెట్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఇందులోనే రిషి సునక్ కూడా పాల్గొన్నారంటూ భారత హై కమిషన్ ట్విట్టర్ లో తెలిపింది. త్వరలోనే టిమ్ కూడా భారత్ లో పర్యటిస్తారని వివరించింది. గత మంగళవారం అమెరికాలో పర్యటించిన అజిత్ డోభాల్ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు.
తాజా వార్తలు
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







