కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన సౌదీ అరేబియా, ఒమన్
- February 05, 2023
రియాద్: కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సముద్రగర్భ కేబుల్ పెట్టుబడుల రంగంలో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్పై సౌదీ అరేబియా, ఒమన్ లు సంతకం చేశాయి. సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్లా అల్ స్వాహా, ఒమన్కు చెందిన సయీద్ బిన్ హమూద్ అల్-మవాలీ సమక్షంలో కింగ్డమ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సుల్తానేట్ రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య ఈ ఒప్పందం సంతకాలు జరిగాయి. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల కోసం మౌలిక సదుపాయాల రంగంలో సహకారాన్ని మెరుగుపరచడానికి, డేటా మార్పిడి కోసం హై-స్పీడ్ డిజిటల్ ఇంటర్కనెక్షన్ కోసం ఇది దోహదం చేస్తుందన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పెట్టుబడి సంస్థలు, లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా ప్రాంతీయ డిజిటల్ కనెక్టివిటీని అమలు చేయడానికి ఎంపికలను అభివృద్ధి చేయడం, గ్లోబల్ డేటా సెంటర్లు, ప్రాంతీయ ఉనికిని లక్ష్యంగా చేసుకునే క్లౌడ్ సేవలలో పెట్టుబడిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..