రుణం ఇప్పిస్తామని మోసం.. ఇద్దరు వ్యక్తులకు dh360,000 జరిమానా, జైలుశిక్ష
- February 05, 2023
దుబాయ్: బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తామని ఒక ఆఫ్రికన్ పెట్టుబడిదారుని మోసం చేసిన ఆసియాకు చెందిన ఇద్దరు పెట్టుబడిదారులకు దుబాయ్ కోర్టు భారీ జరిమానా, జైలుశిక్ష విధించింది. మోసానికి పాల్పడ్డ నిందితులకు రెండు నెలల జైలు శిక్షతోపాటు సంయుక్తంగా $100,000 (Dh367,310) జరిమానాను కోర్టు విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఒక దక్షిణాఫ్రికా పెట్టుబడిదారుడు తనను ఇద్దరు ఆసియన్లు మోసగించారని కేసు పెట్టారు. నిందితుల్లో ఒకరు మరొకరి హామీతో స్థానిక బ్యాంకుల నుండి రుణాలు పొందడంలో తన సహాయాన్ని అందిస్తామని ముందుకొచ్చారని పేర్కొన్నారు. Dh500,000 కమీషన్ చెల్లిస్తే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని మోసం చేశారని తెలిపారు. దుబాయ్లోని అనేక మంది పెట్టుబడిదారులకు తమ వ్యాపారాలను విస్తరించడానికి సహాయం చేసినట్లు నిర్ధారించే పత్రాలను చూపించిన రెండవ నిందితుడిని తాను కలిశానని బాధితుడు చెప్పాడు. స్థానిక బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో ఉన్న పరిచయస్తులు, స్నేహితులు ఉన్నట్లు కూడా నిందితులు మాట్లాడారని ఆయన తెలిపారు. కేసు ఫైల్ ప్రకారం.. పెట్టుబడిదారుడు నిందితులకు, తనకు మధ్య జరిగిన పత్రాలు, సంభాషణలను కోర్టుకు సమర్పించారు. అతను మొదటి నిందితుడి భార్యకు $100,000 బదిలీ చేసినట్లు రుజువు చేసే బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా సమర్పించారు. కేసును విచారించిన కోర్టు నిందితులకు జరిమానా, జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







