నకిలీ ఇన్వాయిస్లతో కార్యాలయం నుంచి Dh431,000 చోరీ
- February 05, 2023
యూఏఈ: పనిచేసిన కంపెనీ నుండి 431,932 దిర్హామ్లను దొంగిలించడానికి నకిలీ ఇన్వాయిస్లను ఉపయోగించిన ఉద్యోగిని దోషిగా కోర్టు తేల్చింది. అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ వ్యక్తి తన మాజీ యజమాని నుండి అపహరించిన నగదును తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. కంపెనీ అకౌంట్స్ విభాగంలో పనిచేసే తన మాజీ ఉద్యోగి నకిలీ ఇన్ వాయిస్ లను ఉపయోగించి నిధులను కాజేసిండని కంపెనీ దావా వేసింది. కాజేసిన 431,932 దిర్హామ్లతోపాటు నష్టపరిహారం కింద 120,000 దిర్హాములను ఇప్పించాలని కంపెనీ తన దావాలో డిమాండ్ చేసింది. అబుదాబి క్రిమినల్ కోర్ట్ అంతకుముందు సదరు ఉద్యోగిని దోషిగా నిర్ధారించి, అపరాధ రుసుముతో శిక్ష విధించింది. కంపెనీకి జరిగిన నష్టాలకు తాత్కాలిక పరిహారంగా 51,000 దిర్హామ్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసును పరిశీలించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆ వ్యక్తి కంపెనీ నుండి దొంగిలించిన 431,932 దిర్హామ్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కంపెనీ చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం