విదేశీ జైళ్లలో మగ్గుతున్న 8343 మంది భారతీయులు:కేంద్ర మంత్రి వి.మురళీధరన్
- February 06, 2023న్యూ ఢిల్లీ: విదేశీ జైళ్లల్లో మొత్తం 8343 మంది భారతీయ ఖైదీలున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ శుక్రవారం లోక్సభలో వెల్లడించారు. వీరిలో విచారణ ఎదుర్కొంటున్న అండర్ట్రైల్ ఖైదీలు కూడా ఉన్నారన్నారు. విదేశాల్లోని భారతీయ ఖైదీల భద్రతకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. యూఏఈలో అత్యధికంగా 1929 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. సౌదీ అరేబియా జైళ్లల్లో 1362 మంది మగ్గుతున్నారు. నేపాల్లో 1222 మంది భారతీయ ఖైదీలున్నారు. ఇక.. విదేశాల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని స్వదేశానికి తరలించేందుకు 31 దేశాలతో భారత్ ఒప్పందాలను చేసుకుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్