టర్కీ-సిరియాలో 7900 మార్కు దాటిన భూకంప మరణాలు

- February 08, 2023 , by Maagulf
టర్కీ-సిరియాలో 7900 మార్కు దాటిన భూకంప మరణాలు

అంకారా: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య కనీసం 7,926 కు పెరిగింది. టర్కీలో కనీసం 5,894 మంది మరణించగా.. 34,810 మంది గాయపడ్డారని టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే తెలిపారు. వాయువ్య సిరియాలో మృతుల సంఖ్య 1,220కి పెరిగిందని, అదే సమయంలో 2,600 మంది గాయపడ్డట్లు సిరియన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 10 దక్షిణ ప్రావిన్స్‌లలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com