బహ్రెయిన్ లో కొత్త ఈడబ్ల్యుఏ కస్టమర్ సర్వీస్ సిస్టమ్ ప్రారంభం
- February 08, 2023
బహ్రెయిన్: కొత్తగా అప్డేట్ చేయబడిన కస్టమర్ సర్వీస్ సిస్టమ్ను విజయవంతంగా ప్రారంభించినట్లు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) ప్రెసిడెంట్ కమల్ బిన్ అహ్మద్ మహమ్మద్ ప్రకటించారు. ఇది EWA అభివృద్ధి వ్యూహంలో భాగమని, అధిక నాణ్యత, సామర్థ్యంతో వినియోగదారులకు అందించే సేవల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవస్థకు విజయవంతంగా మారిన తర్వాత, అన్ని ఛానెల్లలో EWA అన్ని ఎలక్ట్రానిక్ సేవలను పునఃప్రారంభిస్తామని బిన్ అహ్మద్ ప్రకటించారు. వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందించడంతో పాటు, కొత్త వ్యవస్థ ఏకీకృతం చేసేందుకు కొత్త సిస్టమ్ వీలు కల్పిస్తుందన్నారు. స్పష్టమైన బిల్లులను జారీ చేయడం, కస్టమర్లకు మరింత ఖచ్చితమైన సమాచార డెలివరీని కొత్త సిస్టమ్ మెరుగుపరిచిందని తెలిపారు. అలాగే అధిక సామర్థ్యంతో కస్టమర్లకు అన్ని సేవలను అందించడాన్ని సులభతరం చేయడానికి పని వేగాన్ని వేగవంతం చేస్తుందని EWA ప్రెసిడెంట్ కమల్ బిన్ అహ్మద్ మహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









