కొచ్చి విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
- February 09, 2023
కేరళ: రియాద్ నుంచి వచ్చిన ఓ మహిళ కొచ్చిలోని నెడుంబస్సేరి విమానాశ్రయంలో దిగింది.విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే సమయంలో గ్రీన్ ఛానల్ గుండా వెళ్లేందకు ప్రయత్నించడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించారు.ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలని అధికారులు కోరారు.దీంతో ఆమె బదులిస్తూ.. తాను పీరియడ్స్లో ఉన్నానని ఫిజికల్ టెస్ట్కు సహకరించనని తెలిపింది.అయితే ఆమె మాటలు నమ్మని మహిళా అధికారులు పరీక్షించగా..ఆమె రహస్య ప్రాంతంలో ఐదు బంగారు బిస్కెట్లను దొంగతనంగా తీసుకొచ్చింది. ఈ బంగారం ధర సుమారు రూ.30 లక్షలు.
అయితే ఈ సమయంలో ఆ మహిళ అధికారులను బురిడి కొట్టించడానికి కృత్రిమంగా రుతుక్రమాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది.బంగారాన్ని శానిటరీ న్యాప్కిన్లో దాచుకొని, రుతుక్రమం భావన కలిగేందుకు నాప్కిన్కు ఎరుపు రంగును అద్దింది.ఈ విషయం తెలిసిన అధికారులు ఒక్కసారిగా స్టన్ అయ్యారు.ఇక గోల్డ్ స్మగ్లింగ్ కోసం మరి ఇంత దిగజారడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







