శ్రీవారి భక్తులకు శుభవార్త...
- February 10, 2023
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లను ఈనెల 13న విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు భక్తులకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు విడుదల చేయని రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనుంది. మరోవైపు.. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, టికెట్లు తీసుకుని శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించింది.
కాగా.. అంగప్రదక్షిణం టికెట్లు కావాల్సిన భక్తులు తిరుమలలో నిర్ణయించిన విధంగా సంప్రాదాయాలు పాటించాల్సి ఉంటుంది. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ముందుగా.. టోకెన్ మీద నిర్ణయించిన ఎంట్రీ ద్వారం వద్దకు వెళ్లాలి. స్వామి వారి సుప్రభాత సేవ ప్రారంభమైన తరువాత ముందుగా స్త్రీలను అనుమతిస్తారు. వారి ప్రదక్షణ పూర్తయ్యాక పురుషులను అనుమతిస్తారు. స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







