శ్రీవారి భక్తులకు శుభవార్త...
- February 10, 2023
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లను ఈనెల 13న విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు భక్తులకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు విడుదల చేయని రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనుంది. మరోవైపు.. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, టికెట్లు తీసుకుని శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించింది.
కాగా.. అంగప్రదక్షిణం టికెట్లు కావాల్సిన భక్తులు తిరుమలలో నిర్ణయించిన విధంగా సంప్రాదాయాలు పాటించాల్సి ఉంటుంది. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ముందుగా.. టోకెన్ మీద నిర్ణయించిన ఎంట్రీ ద్వారం వద్దకు వెళ్లాలి. స్వామి వారి సుప్రభాత సేవ ప్రారంభమైన తరువాత ముందుగా స్త్రీలను అనుమతిస్తారు. వారి ప్రదక్షణ పూర్తయ్యాక పురుషులను అనుమతిస్తారు. స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









