తైఫ్లో కారు ప్రమాదం.. ఇద్దరు ఉపాధ్యాయులతో సహా నలుగురు మృతి
- February 10, 2023
తైఫ్: తైఫ్కు ఉత్తరాన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులతో సహా రెండు కార్ల డ్రైవర్లు మరణించారు.ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగింది. మృతుల్లో తైఫ్ గవర్నరేట్ నుండి తైఫ్కు ఉత్తరాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహనీలోని మాధ్యమిక పాఠశాలకు వెళుతున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల డ్రైవర్లు కూడా మృతి చెందారు. ట్రాఫిక్ అధికారులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తైఫ్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఫహద్ అల్-షరీఫ్ ప్రమాదంపై ఫాలోఅప్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









