తైఫ్లో కారు ప్రమాదం.. ఇద్దరు ఉపాధ్యాయులతో సహా నలుగురు మృతి
- February 10, 2023
తైఫ్: తైఫ్కు ఉత్తరాన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులతో సహా రెండు కార్ల డ్రైవర్లు మరణించారు.ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగింది. మృతుల్లో తైఫ్ గవర్నరేట్ నుండి తైఫ్కు ఉత్తరాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహనీలోని మాధ్యమిక పాఠశాలకు వెళుతున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల డ్రైవర్లు కూడా మృతి చెందారు. ట్రాఫిక్ అధికారులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తైఫ్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఫహద్ అల్-షరీఫ్ ప్రమాదంపై ఫాలోఅప్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









