ఈ పండ్లు రెగ్యలర్గా మీ డైట్లో వుంటున్నాయా.?
- February 13, 2023కొన్ని పండ్లకు యాంటీ ఏజింగ్ శక్తి వుంటుంది.ఆ పండ్లను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏజ్తో పాటూ వచ్చే కొన్ని కీలకమైన మార్పులూ, కొన్ని అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునే అవకాశముంటుంది.అంతేకాదు, ఏజ్ పరంగా వచ్చే చర్మం పై ముడతల్ని సైతం తగ్గించే శక్తి వుంటుందట.ఆ పండ్లను డైలీ తినడం మర్చిపోకండి మరి.
యాపిల్, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మకాయ తదితర పండ్లను తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.సిట్రస్ జాతికి చెందిన నిమ్మపండులో విటమిన్ సి అధికంగా వుంటుంది. నిమ్మకాయను ఏ రూపంలో తీసుకున్నా చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది. అలాగే చర్మం పై వచ్చే ముడతలు కూడా తొలగించేందుకు తోడ్పడుతుంది.
యాపిల్లో ఎంజైములు అధికంగా వుంటాయి.చర్మం పై మెరుపును కలిగించేందుకు తొడ్పడతాయి.పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్తో పాటూ యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా వుండడం వల్ల చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది.పుచ్చకాయ స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.స్ట్రాబెర్రీ తీసుకోవడం వల్ల రక్తంలో కొల్లాజెన్స్ పెరిగి, చర్మం కాంతి వంతంగా మారడంతో పాటూ, యవ్వనంగా కనిపిస్తారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..