ఖతీఫ్ రన్ ఓవర్ ఘటనలో దోషులకు 15 ఏళ్ల జైలుశిక్ష
- February 16, 2023
సౌదీ: తూర్పు ప్రావిన్స్లోని ఖతీఫ్ గవర్నరేట్లోని 2022 డిసెంబర్లో జరిగిన రన్-ఓవర్ దోపిడీ సంఘటనలో దోషులుగా తేలిన ఇద్దరు సౌదీ పౌరులకు ఒక్కోక్కరికి 15 ఏళ్ల జైలుశిక్షను సౌదీ కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు తమ కారుతో ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. అనంతరం కారునుంచి దిగిన నిందితులు సదరు బాధితుడి దగ్గర ఉన్న విలువైన వస్తువులు, నగదును తీసుకొని సంఘటన ప్రాంతం నుంచి పరారు అయ్యారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూషన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు రిఫర్ చేసింది. దుండగుల దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









