ఖతీఫ్ రన్ ఓవర్ ఘటనలో దోషులకు 15 ఏళ్ల జైలుశిక్ష
- February 16, 2023
సౌదీ: తూర్పు ప్రావిన్స్లోని ఖతీఫ్ గవర్నరేట్లోని 2022 డిసెంబర్లో జరిగిన రన్-ఓవర్ దోపిడీ సంఘటనలో దోషులుగా తేలిన ఇద్దరు సౌదీ పౌరులకు ఒక్కోక్కరికి 15 ఏళ్ల జైలుశిక్షను సౌదీ కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు తమ కారుతో ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. అనంతరం కారునుంచి దిగిన నిందితులు సదరు బాధితుడి దగ్గర ఉన్న విలువైన వస్తువులు, నగదును తీసుకొని సంఘటన ప్రాంతం నుంచి పరారు అయ్యారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూషన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు రిఫర్ చేసింది. దుండగుల దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







