మెడిసిన్ ఫీజు అమలుతో 25 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య

- February 16, 2023 , by Maagulf
మెడిసిన్ ఫీజు అమలుతో 25 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య

కువైట్: ప్రవాసులకు మందుల కోసం అదనపు రుసుము అమలు చేసిన తర్వాత ఆరోగ్య కేంద్రాలను సందర్శించే ప్రవాసుల సంఖ్య 20 నుండి 25 శాతం తగ్గినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య కేంద్రాలు,  ఆసుపత్రి ప్రమాద కేసులకు 5 దినార్లు.. ప్రవాసుల కోసం ఔట్ పేషెంట్ క్లినిక్‌లకు 10 దీనార్లు వసూలు చేయడం ప్రారంభించింది. 2022 డిసెంబర్ 19 నుండి ఫిబ్రవరి 2023 ప్రారంభంలో నమోదైన కేసులను పరిశిలిస్తే.. క్లినిక్‌లను సందర్శించిన ప్రవాసుల సంఖ్య  25 నుండి 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. దాదాపు 30 నుండి 40 శాతం మంది ప్రవాసులు తమ ప్రిస్క్రిప్షన్‌లను తీసుకొని ప్రైవేట్ ఫార్మసీలకు వెళ్లుతున్నట్లు నివేదిక తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com