టర్కీ భూకంప శిథిలాల్లో దొరికిన ఫుట్బాలర్ క్రిస్టియన్ అట్సు మృతదేహం
- February 18, 2023
యూఏఈ: టర్కీలో భారీ భూకంపం తర్వాత కుప్పకూలిన భవన శిథిలాల కింద ఘనా మాజీ అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియన్ అట్సు(31) మృతదేహం గుర్తించినట్లు స్థానిక మీడియా నివేదించింది. భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత అతడిని సహాయక బృందాలు రక్షించాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అతని మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించడంతో అవన్ని తప్పుడు వార్తలు అని తేలింది. టర్కీలోని అతని మేనేజర్ మురత్ ఉజున్మెహ్మెట్ మాట్లాడుతూ.. టర్కీ దక్షిణ ప్రావిన్స్ హటేలో శిథిలాల కింద అతని మృతదేహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మిడ్ఫీల్డర్ అట్సు 2017లో న్యూకాజిల్కు రాకముందు చెల్సియాలో నాలుగు సీజన్లు ఆడారు. అతను టర్కిష్ సూపర్ లిగ్ సైడ్ హటేస్పోర్ కోసం సెప్టెంబర్లో కుదిరిన ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు అట్సు మృతదేహాన్ని రోనేసన్స్ రెసిడెన్స్లో కనుగొన్నారు. ఇది హటేలోని అంటక్య నగరంలో కూలిపోయిన ఎత్తైన విలాసవంతమైన ఫ్లాట్ల బ్లాక్. గత వారం ఈ భవనాల కాంట్రాక్టర్ మోంటెనెగ్రోకు వెళ్తుండగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు టర్కీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







