టర్కీ భూకంప శిథిలాల్లో దొరికిన ఫుట్బాలర్ క్రిస్టియన్ అట్సు మృతదేహం
- February 18, 2023
యూఏఈ: టర్కీలో భారీ భూకంపం తర్వాత కుప్పకూలిన భవన శిథిలాల కింద ఘనా మాజీ అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియన్ అట్సు(31) మృతదేహం గుర్తించినట్లు స్థానిక మీడియా నివేదించింది. భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత అతడిని సహాయక బృందాలు రక్షించాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అతని మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించడంతో అవన్ని తప్పుడు వార్తలు అని తేలింది. టర్కీలోని అతని మేనేజర్ మురత్ ఉజున్మెహ్మెట్ మాట్లాడుతూ.. టర్కీ దక్షిణ ప్రావిన్స్ హటేలో శిథిలాల కింద అతని మృతదేహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మిడ్ఫీల్డర్ అట్సు 2017లో న్యూకాజిల్కు రాకముందు చెల్సియాలో నాలుగు సీజన్లు ఆడారు. అతను టర్కిష్ సూపర్ లిగ్ సైడ్ హటేస్పోర్ కోసం సెప్టెంబర్లో కుదిరిన ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు అట్సు మృతదేహాన్ని రోనేసన్స్ రెసిడెన్స్లో కనుగొన్నారు. ఇది హటేలోని అంటక్య నగరంలో కూలిపోయిన ఎత్తైన విలాసవంతమైన ఫ్లాట్ల బ్లాక్. గత వారం ఈ భవనాల కాంట్రాక్టర్ మోంటెనెగ్రోకు వెళ్తుండగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు టర్కీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







