టర్కీ భూకంప శిథిలాల్లో దొరికిన ఫుట్బాలర్ క్రిస్టియన్ అట్సు మృతదేహం
- February 18, 2023
యూఏఈ: టర్కీలో భారీ భూకంపం తర్వాత కుప్పకూలిన భవన శిథిలాల కింద ఘనా మాజీ అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియన్ అట్సు(31) మృతదేహం గుర్తించినట్లు స్థానిక మీడియా నివేదించింది. భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత అతడిని సహాయక బృందాలు రక్షించాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అతని మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించడంతో అవన్ని తప్పుడు వార్తలు అని తేలింది. టర్కీలోని అతని మేనేజర్ మురత్ ఉజున్మెహ్మెట్ మాట్లాడుతూ.. టర్కీ దక్షిణ ప్రావిన్స్ హటేలో శిథిలాల కింద అతని మృతదేహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మిడ్ఫీల్డర్ అట్సు 2017లో న్యూకాజిల్కు రాకముందు చెల్సియాలో నాలుగు సీజన్లు ఆడారు. అతను టర్కిష్ సూపర్ లిగ్ సైడ్ హటేస్పోర్ కోసం సెప్టెంబర్లో కుదిరిన ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు అట్సు మృతదేహాన్ని రోనేసన్స్ రెసిడెన్స్లో కనుగొన్నారు. ఇది హటేలోని అంటక్య నగరంలో కూలిపోయిన ఎత్తైన విలాసవంతమైన ఫ్లాట్ల బ్లాక్. గత వారం ఈ భవనాల కాంట్రాక్టర్ మోంటెనెగ్రోకు వెళ్తుండగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు టర్కీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









