ఇరాన్ భూకంపంతో ఖతార్‌కు ముప్పు లేదు: అథారిటీ

- February 21, 2023 , by Maagulf
ఇరాన్ భూకంపంతో ఖతార్‌కు ముప్పు లేదు: అథారిటీ

దోహా: నైరుతి ఇరాన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం కారణంగా ఖతార్ రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం లేదని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA)  ప్రకటించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీకి అనుబంధంగా ఉన్న ఖతార్ సీస్మిక్ నెట్‌వర్క్‌లోని అధికారి ఇబ్రహీం ఖలీల్ అల్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఉన్న అరేబియన్ ప్లేట్, ఇరానీయన్ ప్లేట్ కారణంగా జాగ్రోస్ పర్వతాల వెంబడి భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. నైరుతి ఇరాన్‌లో 5.3-తీవ్రతతో సంభవించిన భూకంపం తరువాత ఖతార్ రాష్ట్రం లోపల సంభవించిన ప్రకంపనలు స్పల్పంగా ఉన్నాయని, వాటితో ప్రమాదం లేదని అల్ యూసఫ్ తెలిపారు. ఉదయం 9:05 గంటలకు (దోహా సమయం) ఇరాన్‌కు నైరుతి దిశలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఖతార్ సీస్మిక్ నెట్‌వర్క్ నమోదు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com