ముగిసిన సానియా టెన్నిస్ ప్రస్థానం..
- February 21, 2023
దుబాయ్: భారత స్టార్ సానియా మీర్జా టెన్నిస్ కెరీర్ ముగిసింది. సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన హైదరాబాదీ సానియా కెరీర్లో చివరి టోర్నమెంట్ ఆడేసింది.
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్తో కలిసి మహిళల డబుల్స్లో బరిలోకి దిగిన సానియా మీర్జా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది.

కుదుమెత్సొవా-సంసొనొవా(రష్యా) జంటతో జరిగిన పోరులో సానియా జోడీ 4-6, 0-6 తేడాతో ఓటమి పాలైంది. ఇక కెరీర్లో చివరి టోర్నీ ఆడిన సానియా ఓటమి అనంతరం కన్నీళ్ల పర్యంతరమైంది. సుదీర్ఘ కాలం పాటు భారత్కు ప్రాతినిథ్యం వహించిన సానియా ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు









