అనేక విమానాలను రద్దు చేసిన ఎమిరేట్స్
- February 27, 2023
యూఏఈ: కార్మికులు వేతనాల కోసం చేపట్టిన సమ్మె కారణంగా దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఫిబ్రవరి 27న అనేక విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డ్యూసెల్డార్ఫ్ విమానాశ్రయంలో ప్రకటించిన సార్వత్రిక సమ్మె కారణంగా ఫిబ్రవరి 27న దుబాయ్ -డ్యూసెల్డార్ఫ్ మధ్య పలు విమానాలు రద్దు చేసినట్లు ఎమిరేట్స్ తెలిపింది. రద్దయిన విమానాల్లో EK055: దుబాయ్ నుండి డ్యూసెల్డార్ఫ్, EK056: డ్యూసెల్డార్ఫ్ నుండి దుబాయ్, EK057 : దుబాయ్ నుండి డ్యూసెల్డార్ఫ్, EK058 : డ్యూసెల్డార్ఫ్ నుండి దుబాయ్ ఉన్నాయి.
జర్మనీలోని వెర్డి లేబర్ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 27న కొలోన్ బాన్ (CGN), డ్యూసెల్డార్ఫ్ (DUS) విమానాశ్రయాల వద్ద సమ్మె చేయాలని యోచిస్తున్నారు. సమ్మె ఫిబ్రవరి 26-27 రాత్రిపూట ప్రారంభమై.. ఫిబ్రవరి 27-28 రాత్రిపూట ముగియనుంది. సమ్మె కారణంగా ప్రభావిత విమానాశ్రయాలలో ప్రాసెసింగ్ ఆలస్యం, రద్దుతో సహా విమాన అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన ఎమిరేట్స్.. బాధిత ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం ట్రావెల్ ఏజెంట్లు, ఎమిరేట్స్ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







