ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు..
- March 01, 2023
ముంబై: ముంబైలో ఓ పాక్ ఉగ్రవాది ఎంటర్ అయ్యాడని ఎన్ఐఏ పోలీసు వర్గాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదిని పట్టుకునేందుకు జాతీయ సంస్థలు, పోలీసులు తీవ్రగాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతోపాటు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. అగ్ర నటుల నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ మంగళవారం ఉదయం నాగ్పుర్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఆగంతకుడు ఫోన్ చేశాడు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. క్షణ్ణంగా పరిశీలించిన అనంతరం పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదని ముంబై పోలీసులు వెల్లడించారు.సమాచారం ప్రకారం.. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రతోపాటు యాంటిలియాలోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.
అయితే, అమితాబ్ బచ్చన్కు ముంబైలో ఐదు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అతని ఇళ్ల పేర్లు– జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష. బచ్చన్లు ముంబైలో కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ప్రతీఖా. అమితాబ్ దివంగత తల్లిదండ్రులు నివసించే ఇల్లు ఇదే. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం మొత్తం జల్సాలో నివసిస్తోంది. మరోవైపు ధర్మేంద్ర జుహూలోని బంగ్లాలో నివాసం ఉంటున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







