108 వాహనాలను ట్రాక్ చేసే పద్ధతిని తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం
- March 02, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాల్లో ఉన్న వారి కోసం 108 వాహనాలను ట్రాక్ చేసే పద్ధతిని తీసుకరాబోతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 108 కు కాల్ చేస్తాం..108 వాహనం వచ్చేవరకు ఎదురుచూస్తుంటాం..కొన్నిసార్లు 108 వాహనం ఆలస్యమైతే ప్రవైట్ వాహనాల్లో బాధితుడిని తీసుకెళతాం. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్.. ఓలా, ఊబర్, రాపిడో లాంటి వెహికిల్స్ను ట్రాక్ చేసే తరహాలోనే.. 108 వాహనాలనూ ట్రాక్ చేసే పద్ధతిని ఏపీ వైద్య శాఖ ప్రవేశపెడుతోంది.
ఈ ట్రాకింగ్ విధానం వల్ల 108 వాహనం ఎక్కడ వరకు వచ్చింది? ఎంతసేపట్లో తమ దగ్గరకు వస్తుందనే విషయాలను బాధితులు ట్రాక్ చేసే వీలుంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా ముగిసిందని తెలుస్తోంది. అంబులెన్స్ల ట్రాకింగ్ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆరోగ్యశ్రీ మీద నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ అంబులెన్స్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి ఆఫీసర్స్ను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ట్రాకింగ్ సిస్టమ్ను అమలు చేస్తామని రజిని తెలిపారు. అంబులెన్స్ ఎక్కడుందో తెలుసుకునేందుకు మొబైల్స్కు రూట్ మ్యాప్ లింక్ను పంపేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..