దుబాయ్లో Dh300 విలువ దాటిన వస్తువులపై కస్టమ్స్ సుంకం తొలగింపు
- March 03, 2023
యూఏఈ: అంతర్జాతీయంగా 300 దిర్హాం కంటే ఎక్కువ విలువతో కొనుగోలు చేసే వస్తువులపై అమలవుతున్న కొత్త కస్టమ్స్ సుంకాన్ని నిలిపివేయాలని దుబాయ్ నిర్ణయించింది. ఈ మేరకు దుబాయ్ కస్టమ్స్ విభాగం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 1,000 దిర్హాం దాటిన పార్శిల్స్, షిప్మెంట్లపై కస్టమ్ సుంకం విధించనున్నట్లు పేర్కొంది. కొత్త కస్టమ్ సుంకం నిబంధనలు మార్చి 1 నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ అంతర్జాతీయంగా 300 దిర్హామ్ కంటే ఎక్కువ విలువైన వస్తువులపై కొత్త కస్టమ్స్ సుంకాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు కొనుగోలు చేసిన వస్తువులు Dh1,000 కంటే ఎక్కువ విలువ ఉంటేనే కస్టమ్ సుంకం వర్తించేది. అంతర్జాతీయంగా షాపింగ్ చేసే నివాసితులు ఐదు శాతం దిగుమతి కస్టమ్స్ సుంకం, ఐదు శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించాలి. పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఇ-సిగరెట్లు, వేపింగ్ లిక్విడ్లపై 200 శాతం చొప్పున సుంకం వర్తిస్తుందని దుబాయ్ కస్టమ్స్ విభాగం తెలిపింది. 2017లో యూఏఈలో కార్బోనేటేడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, పొగాకు, పొగాకు ఉత్పత్తుల వంటి మానవ ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇ-స్మోకింగ్ పరికరాలు, సాధనాలను ఎక్సైజ్ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







