2022లో కువైట్ విడిచిన 178,919 మంది ప్రవాసులు
- March 03, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022 సంవత్సరంలో 178,919 మంది ప్రవాసులు కువైట్ విడిచిపెట్టారు. 2022 సంవత్సరం మధ్య నాటికి మొత్తం ప్రవాస కార్మికుల సంఖ్య 2 మిలియన్ల 718 వేల 803 మంది. అదే 2021లో వారి సంఖ్య సుమారు 2 మిలియన్ల 897 వేల 522 మంది. దాదాపు 178,919 మంది ప్రవాసులు కువైట్ నుండి ఒక సంవత్సరంలో శాశ్వతంగా వెళ్లిపోయారని అథారిటీ నివేదిక స్పష్టం చేస్తుంది. అదే విధంగా యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన 17,891 మంది ప్రవాసులు ఆరోగ్య బీమా రుసుము అమలు చేసిన తర్వాత దేశం విడిచిపెట్టారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాస కార్మికుల సంఖ్య 2021 మధ్యలో దాదాపు 122,536 నుండి 2022 మధ్య నాటికి 104,645కి తగ్గింది. యూనివర్శిటీ డిగ్రీ హోల్డర్లలో 2021 మధ్యలో 155,665 నుండి 2022 మధ్యలో 146,942కి తగ్గుదల నమోదైంది. దీనికితోడు పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య కూడా 2021 మధ్యలో 7,213 నుండి 2022 మధ్యలో 6,912కి తగ్గింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







