2022లో కువైట్ విడిచిన 178,919 మంది ప్రవాసులు
- March 03, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022 సంవత్సరంలో 178,919 మంది ప్రవాసులు కువైట్ విడిచిపెట్టారు. 2022 సంవత్సరం మధ్య నాటికి మొత్తం ప్రవాస కార్మికుల సంఖ్య 2 మిలియన్ల 718 వేల 803 మంది. అదే 2021లో వారి సంఖ్య సుమారు 2 మిలియన్ల 897 వేల 522 మంది. దాదాపు 178,919 మంది ప్రవాసులు కువైట్ నుండి ఒక సంవత్సరంలో శాశ్వతంగా వెళ్లిపోయారని అథారిటీ నివేదిక స్పష్టం చేస్తుంది. అదే విధంగా యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన 17,891 మంది ప్రవాసులు ఆరోగ్య బీమా రుసుము అమలు చేసిన తర్వాత దేశం విడిచిపెట్టారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాస కార్మికుల సంఖ్య 2021 మధ్యలో దాదాపు 122,536 నుండి 2022 మధ్య నాటికి 104,645కి తగ్గింది. యూనివర్శిటీ డిగ్రీ హోల్డర్లలో 2021 మధ్యలో 155,665 నుండి 2022 మధ్యలో 146,942కి తగ్గుదల నమోదైంది. దీనికితోడు పోస్ట్ గ్రాడ్యుయేట్ల సంఖ్య కూడా 2021 మధ్యలో 7,213 నుండి 2022 మధ్యలో 6,912కి తగ్గింది.
తాజా వార్తలు
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్







